అడిలైడ్: ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం నాడు భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహం ఫలించింది. ధోనీ వ్యూహాత్మకంగా రెండో డౌన్లో విరాట్ కోహ్లీని పంపించాడు. కోహ్లీ - శిఖర్ ధావన్లు ఆచితూచి ఆడుతూనే, దూకుడు కొనసాగిస్తున్నారు.
రోహిత్ శర్మ త్వరగా అవుటయ్యాడు. జట్టు స్కోరు 25 పరుగులు ఉన్నప్పుడు రోహిత్ (15) అవుటయ్యాడు. అయితే, కోహ్లీ - ధావన్లు బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ దూకుడుగా కనిపిస్తోంది. అనంతరం 163 పరుగుల వద్ద ధావన్ (73) వికెట్ కోల్పోయింది. భారత్ ముప్పై ఓవర్ల తర్వాత మరింత దూకుడు పెంచే అవకాశముంది.
300 దాటించాలి..

అడిలైడ్ బ్యాటింగ్ పిచ్. అంతేకాకుండా, మన బౌలర్లు అంత ప్రభావం చూపే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ 330 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఫాకిస్తాన్ ముందు ఉంచితే, ప్రత్యర్థి జట్టు పైన ఒత్తిడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీని రెండో డౌన్లో దించిన ధోనీ వ్యూహం ఫలించిందని చెబుతున్నారు.
ముంబైలో అడిలైడ్ ఫీవర్
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో భారీగా బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒక్క ముంబైలోనే ముప్పై వేల కోట్ల రూపాయల మేర బెట్టింగ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ను వంద కోట్ల మందికి పైగా చూడనున్నారు.