హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ అప్పుడే మొదలైంది. జనవరి 27, 28న బెంగళూరు వేదికగా ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఈ ఇద్దరి ఆటగాళ్లలో ఏ ఆటగాడిని మీ జట్టులో స్థానం కల్పిస్తారు అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ తన ట్విట్టర్లో ఓ పోల్ నిర్వహించాడు.
Final results ... It’s MS Dhoni 61 % would still pick NOW over Jos .... #MyArse https://t.co/682mpnMOos
— Michael Vaughan (@MichaelVaughan) January 23, 2018
ఈ పోల్లో అందరూ ఊహించినట్టే మహేంద్ర సింగ్ ధోనికి ఎక్కువ మంది ఓట్ చేశారు. ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ను 0-3తో ఇంగ్లాండ్ జట్టు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ అనంతరం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
తాజాగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ (100, 83 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డే సిరీస్కు వాన్ కామెంటేటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన ట్విటర్లో ఓ పోల్ నిర్వహించాడు.
'బట్లర్, ధోనీ.. ఈ ఇద్దరిలో ఎవర్ని మీ జట్టులోకి తీసుకుంటారు' అని అందులో పేర్కొన్నాడు. ఈ పోల్కి మొత్తం 57,918 ఓటు చేశారు. ఇందులో 61 శాతం ఓట్లు ధోనికి రాగా జోస్ బట్లర్కు కేవలం 39 శాతం మాత్రమే వచ్చాయి. ఈ ఫోల్ ఫలితాలను వాన్ ప్రకటిస్తూ 'భారత్-ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య ఇంకెప్పుడు పోల్ నిర్వహించకూడదు' అని ట్వీట్ చేశాడు.
MS Dhoni is on the charge ...... https://t.co/682mpnMOos
— Michael Vaughan (@MichaelVaughan) January 22, 2018
Intrigued what you all think...You are allowed 1 of these 2 now in your team... Who you going for on present form !??
— Michael Vaughan (@MichaelVaughan) January 22, 2018
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.