న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని వెనుకే బట్లర్: ట్విట్టర్‌లో మైకేల్ వాన్ ఆసక్తికర పోల్‌

By Nageshwara Rao
MS Dhoni or Jos Buttler? The poll Michael Vaughan regrets running on Twitter

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ అప్పుడే మొదలైంది. జనవరి 27, 28న బెంగళూరు వేదికగా ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ ఈ ఇద్దరి ఆటగాళ్లలో ఏ ఆటగాడిని మీ జట్టులో స్థానం కల్పిస్తారు అని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించాడు.

ఈ పోల్‌లో అందరూ ఊహించినట్టే మహేంద్ర సింగ్ ధోనికి ఎక్కువ మంది ఓట్ చేశారు. ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను 0-3తో ఇంగ్లాండ్ జట్టు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ అనంతరం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

తాజాగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ (100, 83 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డే సిరీస్‌కు వాన్ కామెంటేటర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన ట్విటర్‌లో ఓ పోల్‌ నిర్వహించాడు.

'బట్లర్‌, ధోనీ.. ఈ ఇద్దరిలో ఎవర్ని మీ జట్టులోకి తీసుకుంటారు' అని అందులో పేర్కొన్నాడు. ఈ పోల్‌కి మొత్తం 57,918 ఓటు చేశారు. ఇందులో 61 శాతం ఓట్లు ధోనికి రాగా జోస్ బట్లర్‌కు కేవలం 39 శాతం మాత్రమే వచ్చాయి. ఈ ఫోల్ ఫలితాలను వాన్ ప్రకటిస్తూ 'భారత్‌-ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల మధ్య ఇంకెప్పుడు పోల్‌ నిర్వహించకూడదు' అని ట్వీట్ చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 19:18 [IST]
Other articles published on Jan 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X