8.58 శాతం స్కోరుతో రెండో స్థానంలో ధోని
ఈ సర్వేని యుగౌవ్(YouGov) చేపట్టింది. ఇక, క్రీడాకారుల విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 8.58 శాతం స్కోరుతో రెండో స్థానంలో నిలిచారు. ప్రధాని మోడీ 15.66 శాతం స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ధోని తర్వాత సచిన్ టెండూల్కర్(5.81శాతం), విరాట్ కోహ్లీ(4.46 శాతం), క్రిస్టియానో రొనాల్డో(2.95 శాతం), లియోనల్ మెస్సీ(2.32 శాతం) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్గా ధోని
ఈ స్కోరు ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి ఆయా క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. భారత్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఐసీసీ నిర్వహించే మూడు మేజర్ టోర్నీలను భారత్కు అందించిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.
టాప్-25లో మేరీ కోమ్
ఇక, మహిళల కేటగిరీలో మేరీ కోమ్(10.36 శాతం)తో ఈ జాబితాలో టాప్-25లో చోటు దక్కించుకోగా... కిరణ్ బేడీ, లతా మంగేస్కర్, సుష్మా స్వరాజ్, దీపికా పదుకొణెలు టాప్-5లో ఉన్నారు.