కోహ్లీ నాయకత్వంలో
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇటు స్వదేశంలో పాటు అటు విదేశాల్లోనూ అనేక అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లలో టెస్ట్ సిరీస్ గెలవడంలో విఫలమైనప్పటికీ.. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ను గెలిచి ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది.
ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడిన భారత్
విరాట్ కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై టీమిండియా ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడింది. క్రిక్బజ్కి ఇచ్చిన ఇంటర్యూలో అజయ్ జడేజా మాట్లాడుతూ "ధోని కెప్టెన్సీ కోహ్లీ కెప్టెన్సీ కంటే బాగుండదని ఎవరైనా అనుకుంటే వారు నాతో వాదించొచ్చు. అయితే, ఈ మార్పు కేవలం వరల్డ్కప్ వరకే. కెప్టెన్గా వ్యూహాలు రచించడంలో ధోని దిట్ట" అని అన్నాడు.
సఫారీలతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్కప్లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్తో ఆడాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది.
వరల్డ్కప్ కోసం అజయ్ జడేజా ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), అంబటి రాయుడు, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్