
హైదరాబాద్: బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 టోర్నమెంట్కు ఖచ్చితంగా ధోనీ హాజరుకాలేడని వార్తలు వినిపిస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ ముస్తఖ్ అలీ పేరు మీదుగా నిర్వహిస్తున్న ట్రోఫీలో గతేడాది ధోనీ ఆడాడు. అలీ భారత్ తరపున ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్లో తొలి సెంచరీని నమోదు చేసిన యోధుడు.
అంతకుముందు ఈ టోర్నమెంట్ రంజీ జట్ల మధ్య జరిగింది. ఈ లీగ్లో మార్పులు చేసిన బీసీసీఐ దీన్ని జోనల్ బేస్డ్ కాంపిటీషన్గా మార్చింది. జనవరి 21 నుంచి 27వరకు జరగనున్న ఈ టోర్నమెంట్ ఇప్పటికీ ఇదే ట్రోఫీలో తొమ్మిదోది.
ధోనీ ప్రస్తుతం అంతర్జాతీయ జట్టు తరపున ఆడుతుండటంతో ఈ ట్రోఫీకి హాజరుకాలేడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ధోనీ కూడా ధృవీకరించాడు. దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ మ్యాచ్లో పాల్గొంటున్న ధోనీ బిజీబిజీ కానున్నాడు.
టెస్ట్ మ్యాచ్ అనంతరం జరగనున్న ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 15కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.