ముంబై: బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో భారత్ గెలుపు నేపథ్యంలో కెప్టెన్ ధోనీ పైన ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులు, మాజీ ఆటగాళ్లు ధోనీని ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా, మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కితాబిచ్చాడు.
ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ... ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ధోనీకి తెలుసునని చెప్పాడు. అతని ప్రణాళికలు చూస్తుంటే అతని దూకుడు అర్థమవుతోందని అభిప్రాయపడ్డాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటగాళ్ల చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నాడు. చివరలో ముష్ఫికర్, మహ్మదుల్లాలు భారీ షాట్లకు వెళ్లారని, అది సరికాదని ఆయన అన్నాడు.

పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా ధోనీకి కితాబిచ్చాడు. బౌలింగ్ మార్పు ద్వారా ధోనీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించాడు. భారత్ మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే, పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా కూడా ధోనీకి కితాబిచ్చారు.