హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో సెలక్టర్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు దొరికిన విరామ సమయాన్ని ధోని ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
మిథాలీని తప్పించడంపై నివేదిక: మేనేజ్మెంట్, సెలక్టర్ ఏమన్నారంటే!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం దొరికితే ధోని కుటుంబంతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతాడు. ముఖ్యంగా తన ముద్దుల కుమార్తె జీవాతో సరదాగా ఆడిపాడుతుంటాడు. తాజాగా తన కుమార్తెతో ఆడుకుంటుండగా తీసిన వీడియోను ధోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
జీవా కోసం ధోని బగ్స్ బన్నీ పాత్ర పోషించాడు. ఒక యానిమేటెడ్ కార్టూన్ పాత్ర తరహాలో పెద్ద క్యారట్ను జివా ధోనికి తినిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని ధోని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ 'జీవా' బగ్స్ బన్నీ అనే క్యాప్షన్ పెట్టాడు. ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత టీ20 జట్టులో ధోనికి చోటుదక్కని సంగతి తెలిసిందే.
View this post on InstagramZiva’s bugs bunny @zivasinghdhoni006
A post shared by M S Dhoni (@mahi7781) on
గత కొంతకాలంగా బ్యాట్తో ధోని నిరాశ పరుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వెస్టిండిస్తో ముగిసిన సిరిస్లో సైతం ధోని ఆశించిన స్థాయిలో రాణించలేదు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ నేపథ్యంలో రిజర్వ్ వికెట్ కీపర్ కోసం సెలక్టర్లు విండీస్, ఆసీస్తో టీ20సిరీస్ల్లో యువ ఆటగాడు రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చారు.
View this post on InstagramA post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on