హైదరాబాద్: క్యాండిల్ లైట్ డిన్నర్ డేట్ అంటే తనకు ఏంటో తెలియదని, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో డిన్నర్ డేట్కు వెళ్లాలని ఉందని తన మనసులోని మాటను చెప్పింది బాలీవుడ్ నటి కైరా అద్వాణి. గతేడాది ధోని జీవితం ఆధారంగా వచ్చిన 'ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ' సినిమాలో ధోని భార్య సాక్షి పాత్రను కైరా పోషించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెను అభిమాన క్రికెటర్ ఎవరని ప్రశ్నించగా ఇంకెవరూ మహేంద్ర సింగ్ ధోని అంటూ సమాధానమిచ్చింది. అనంతరం క్యాండిల్ లైట్ డిన్నర్ డేట్కు ఎవరితో వెళ్లాలని ఉంది అని అడగ్గా.. ఆమె ఏమాత్రం తడుముకోకుండా ధోని పేరు వెల్లడించింది.

'ధోనికి ఇప్పటికే పెళ్లి అయింది. కుటుంబసభ్యుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటాడు. క్యాండిల్ లైట్ డిన్నర్ డేట్ అంటే ఏమిటో నాకు తెలియదు. కానీ, ధోనితో మాత్రం డిన్నర్ చేయాలని ఉంది. ధోని చూసేందుకు చాలా సింపుల్గా ఉంటాడు. అందుకే నాకు అతనంటే చాలా ఇష్టం. ఇక, విరాట్ కోహ్లీ చాలా హాట్గా కనిపిస్తాడు' అని చెప్పింది.