
పేలవ ఫీల్డింగ్తో బెంగళూరుకు ఓటమి
ఓపెనర్ పార్థీవ్ పటేల్ 41 బంతుల్లో (53) చివర్లో టిమ్ సౌథీ 26 బంతుల్లో (36) నాటౌట్ రాణించడంతో ఆర్సీబీ వంద పరుగుల మార్కు దాటగలిగింది. అనంతరం 128పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి మొదట్లో ఉమేశ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో కళ్లెం వేశాడు. అయితే మిగతా బౌలర్లు సత్తా చాటలేకపోవడం.. మరోవైపు పేలవ ఫీల్డింగ్తో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

12బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని
చెన్నై కెప్టెన్ ధోనీ 23బంతుల్లో (31) నాటౌట్ మరోసారి తనదైన శైలిలో ఫినిషింగ్ ప్రదర్శనతో మరో 12బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కెప్టెన్గా ధోనీ జట్టును ముందుండి మ్యాచ్ను గెలిపించడమే కాకుండా ఈ మ్యాచ్లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యధిక సిక్సర్లు(27) బాది నూతన రికార్డు
వ్యక్తిగతంగా ఈ సీజనులో ధోనీ అత్యధిక సిక్సర్లు(27) బాది నూతన రికార్డును నెలకొల్పాడు. గతంలో 2013లో అత్యధికంగా 25సిక్సర్లు బాదగా.. అంతకుముందు 2011లో 23సిక్సర్లు, 2014 ఐపీఎల్లో 20 సిక్సర్లు కొట్టాడు. దీంతో తన ఐపీఎల్ కెరీర్లో తొలిసారిగా ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు సాధించగలిగాడు. అది కూడా కేవలం 10 మ్యాచ్లలోపే కావడం విశేషం. మరోవైపు మొత్తం ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (183 సిక్సర్లతో) మూడో స్థానంలో కొనసాగతున్నాడు. ధోనీ కంటే ముందు క్రిస్ గేల్(290), రోహిత్ శర్మ (183) ఉన్నారు.

10మ్యాచ్లాడి 360 పరుగులతో
ఇదిలాఉండగా.. ఇప్పటివరకూ ఐపీఎల్లో 169 మ్యాచ్లాడిన ధోనీ..153ఇన్నింగ్స్లలో మొత్తం 3921పరుగులు సాధించాడు. ఇక ఈ సీజనులోనూ ధోనీ పూర్వ ఫామ్ అందుకొని జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకూ 10మ్యాచ్లాడి 360 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.


Click it and Unblock the Notifications

