
భారత్కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు
"అలాగే, భారత్ మిలటరీకి ధోని ఎంత గౌరవం ఇస్తాడో అందరికీ తెలుసు. ఒంటి చేత్తో భారత్కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఘనత ధోనిది. కేవలం ఒకటో-రెండో వరల్డ్కప్లను ధోని గెలవలేదు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తనదైన ముద్ర వేస్తూ భారత్ క్రికెట్కు వన్నె తెచ్చాడు. ఈ సమయంలో ప్రతీ భారతీయుడు ధోనికి అండగా నిలుస్తారనే అనుకుంటున్నా" అని శ్రీశాంత్ తెలిపాడు.

ఐసీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
"ఐసీసీ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని... భారత్ ప్రజలను క్షమపణలు కోరుతూ లేఖ రాస్తుందని భావిస్తున్నా. ధోనీని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఆ గ్లౌజులతో ధోని ఆడటాన్ని చూసి నెనెంత గర్వపడ్డానో తెలియదు. ఈ గ్లౌజులు ధరించి ధోని భారత్కు వరల్డ్ కప్ గెలవాలి" అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ ఇలా
ఇక, బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ "చాలా సందర్భాల్లో ఆటగాళ్లు వివిధ రకాలైన క్యాప్లను ధరిస్తూ ఉంటారు. అటువంటప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చింది" అని ప్రశ్నించాడు. మరోవైపు ట్విట్టర్లో #DhoniKeepTheGlove అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ భారత అభిమానులు ధోనీకి మద్దతు నిలుస్తున్నారు.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ టీషర్టులపై మూడు సింహాల లోగో
"ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనని" మరోక నెటిజన్ కామెంట్ పెట్టాడు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిమానులు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.

వినోద్ రాయ్ మాట్లాడుతూ
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ స్పందించారు. ధోని ధరించిన గ్లౌజ్పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ధోని ధరించిన గ్లౌజ్పై ఉన్న లోగో మిలటరీ సింబల్ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఇందుకు ఐసీసీ అనుమతి కోరాం" అని తెలిపారు.


Click it and Unblock the Notifications












