హైదరాబాద్: అనుభవన్నంతా రంగరించి చెన్నై జట్టును విజేతగా నిలిపిన మహేంద్రసింగ్ ధోనీపై సహచర జట్టు ఆటగాడైన కేఎల్ రాహుల్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన కేఎల్ రాహుల్ చెన్నై జట్టు ఆటను టీవీలో చూస్తుండటం చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ధోనీ తన దూకుడుతో ప్రత్యర్థులకి గుండెపోటు తెప్పించాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సరదాగా వ్యాఖ్యానించాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచిన చెన్నై జట్టు మూడోసారి టైటిల్ని గెలిచిన విషయం తెలిసిందే. టోర్నీలో ధోనీ హిట్టింగ్.. తనను అమితంగా ఆకట్టుకుందని.. అతను క్రీజులో ఆడుతుంటే.. టీవీలో చూడటాన్ని బాగా ఆస్వాదించానని కేఎల్ రాహుల్ తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే టీవీలో చూస్తూ బాగా ఆస్వాదించేవాడ్ని. ముఖ్యంగా జట్టుని అతను గెలిపించే తీరు నన్ను అమితంగా ఆకట్టుకుంది. మళ్లీ అతను ఐపీఎల్లో కెప్టెన్గా పనిచేయడం, టైటిల్ గెలిచిన తీరు ఓ గొప్ప అనుభూతి. ధోనీ గురించి చెప్పాలంటే.. అతని వ్యక్తిత్వం, నాయకత్వం గురించే ఎక్కువ చెప్పాలేమో..? మ్యాచ్ చివర్లో అతను కొట్టే సిక్సర్లు.. అద్భుతం. అలా ఆడే ఐపీఎల్లో అతని ప్రత్యర్థి జట్లకి గుండెపోటు తెప్పించాడు' అని రాహుల్ సరదాగా వ్యాఖ్యానించాడు.
గడిచిన సీజన్లో కింగ్స్ ఎలెవన్ జట్టు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ 14 మ్యాచ్లు ఆడి 659 పరుగులు సాధించాడు. 2013వ సంవత్సరంలో ఐపీఎల్లోకి అరంగ్రేటం చేసిన రాహుల్ మొత్తంగా 1384 పరుగులు చేశాడు. ఇతని అత్యధిక స్కోరు 95.