రాయుడుని రనౌట్ చేసిన ఉమేశ్ యాదవ్
18 ఓవర్లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్ యాదవే రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్లో 5వ వికెట్ భాగస్వామ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సెంచరీ పరుగులు సాధించటం ఇదే తొలిసారి. రాయుడు-ధోనీ కలిసి 59 బంతుల్లో 101 పరుగులు సాధించారు.
సిక్సుతో చెన్నైకి విజయాన్ని అందించిన ధోని
రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ గతంలో కూడా (2012 చెన్నైలో జరిగిన మ్యాచ్లో) 206 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చేధించింది.
ధోని అరుదైన రికార్డు
ఐపీఎల్లో బెంగళూరు జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గంభీర్ పేరిట ఉంది. ఈ మ్యాచ్లో నమోదైన మొత్తం సిక్స్ల సంఖ్య 33. ఐపీఎల్లో ఇప్పటిదాకా అత్యధికం.
100 వికెట్ల క్లబ్లో ఉమేశ్ యాదవ్
ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్... చెన్నై ఆటగాడు మన్దీప్ సింగ్ వికెట్ తీయడం ద్వారా ఐపీఎల్లో వంద వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
రెండు సార్లు చేధించిన రెండో జట్టుగా చెన్నై
ఒక సీజన్లో 200కుపైగా పరుగుల టార్గెట్ను రెండు సార్లు చేధించిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. (ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 203 పరుగుల టార్గెట్ను చేధించిన సంగతి తెలిసిందే) గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఘనతను సాధించింది. 2014 సీజన్లో దక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది.