
భారత్ - బంగ్లా మ్యాచ్
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో కెప్టెన్ ధోనీ అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏమాత్రం అనుభవం లేని పేసర్ పాండ్యను ఎంచుకున్నాడు. అంతేకాదు, చివరి బంతికి సూచనలు కూడా చేశాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్
బంగ్లా విజయానికి 11 పరుగుల దూరంలో ఉంది. ఎలాంటి ప్రయోగానికి పోలేదు ధోని. పాండ్యకు బంతి ఇచ్చాడు. ఏమవుతుందో అని తీవ్ర ఒత్తిడితో ఎక్కడి వారు అక్కడ కదలకుండా మ్యాచ్ చూస్తుండగా.. సరదాగా నవ్వుతూ బంతి అందుకున్నాడు పాండ్య.

భారత్ - బంగ్లా మ్యాచ్
తొలి బంతిని ఆఫ్స్టంప్ ఆవల వేయగా మహ్మదుల్లా ఒక పరుగు చేశాడు. రెండో బంతిని స్లో బాల్ వేయగా ఎక్స్ట్రా కవర్ దిశగా బౌండరీ బాదేశాడు ముష్ఫికర్. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. ఆఫ్స్టంప్ ఆవల వేసిన బంతిని ముష్పికర్ స్వీప్ చేయడంతో మరో ఫోర్.

భారత్ - బంగ్లా మ్యాచ్
ఈ సమయంలో మ్యాచ్ భారత్ చేజారినట్లే కనిపించింది. మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు. ఈ దశలో భారత్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ అద్భుతం జరిగింది. నాలుగో బంతికి పాండ్య స్లో బాల్ వేయగా ముష్ఫికర్ పుల్ షాట్ ఆడాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్
క్యాచ్ అందుకోవడంలో శిఖర్ ధావన్ పొరపాటు చేయలేదు. ఐదో బంతికి ఫుల్ టాస్ బంతిని మహ్మదుల్లా భారీ షాట్ కొట్టగా జడేజా చక్కటి క్యాచ్ అందుకున్నాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్
ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే బంగ్లా గెలుపు. టై అయినా భారత్కు మేలే. ఆస్ట్రేలియాపై గెలిస్తే చాలు.. సెమీస్ చేరుకోవచ్చు. ఇలా అభిమానులు అంచనాల లెక్కలు వేసుకుంటున్న సమయంలో పాండ్య ఆఫ్స్టంప్కు దూరంగా బంతి వేశాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్
వికెట్ల వెనక బంతి అందుకున్న ధోని ఎలాంటి పొరపాటు చేయకుండా పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాట్స్మన్ను రనౌట్ చేశాడు. భారత్ ఒక్క పరుగుతో గెలిచింది.


Click it and Unblock the Notifications











