
స్నేహితులతో ఫామ్హౌజ్లో
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెలెక్టర్లకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏం చెప్పాడో తెలియదు కానీ.. ఎవరిని అడిగినా ధోనీ రిటైర్మెంట్పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ తాత్కాలిక విరామంను ధోనీ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కూతురు జీవాతో. ఆదివారం రాంచీకి దగ్గరల్లోని తన ఫామ్హౌజ్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోనీ చిల్ అయ్యాడు.

స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్
చిన్ననాటి స్నేహితుడు లోహానీ బర్త్డే వేడుకలను ధోనీ తన ఫామ్హౌజ్లో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకులో ధోనీ స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. జీవా కూడా సందడి చేసింది. ధోనీ కేక్ కట్ చేసి లోహానీకి రుద్దాడు. అనంతరం జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయ్యాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.

నిసాన్ జోంగాలో చక్కర్లు
అంతకుముందు తన ఇంట్లోని కుక్కలతో సరదగా ఆడుకోవడం, జీవా ధోనితో కలసి అల్లరి చేయడం వంటి వీడియోలను ధోనీ షేర్ చేసిన విషయం తెలిసిందే. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలతో కూడా తన నివాసంలో సరదా సమయం గడిపాడు. ధోనీ.. తాను ఇటీవల కొనుగోలు చేసిన నిసాన్ జోంగాలో చక్కర్లు కొట్టాడు. రాంచీ వేదికగా ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్ని వీక్షించేందుకు స్టేడియానికి ఈ వాహనంలోనే ధోనీ వచ్చిన విషయం తెలిసిందే.

రీఎంట్రీ వచ్చే ఏడాదే
విశ్రాంతి కారణంగా ధోనీ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లకు దూరమయ్యాడు. అంతేకాదు డిసెంబరులో వెస్టిండీస్తో జరగనున్న సిరీస్లోనూ ఈ మాజీ కెప్టెన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో.. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్లో మళ్లీ ధోనీ రీఎంట్రీ ఇచ్చే అవకాశముందని సమాచారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
