
విద్యార్థులతో బాలల దినోత్సవం:
క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ రాంచీలో పలువురు పిల్లలతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాడు. వారితో కలిసి సరదా సమయం గడిపి.. ఈ బాలల దినోత్సవంను అక్కడి పిల్లలకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేశాడు. అంతేకాదు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విద్యార్థులకు సంతకం చేసిన బ్యాట్లను కూడా అందించాడు.

ఆర్మీపై ప్రేమ:
సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ.. బాలల దినోత్సవం సందర్భంగా మరోసారి భారత ఆర్మీపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. గురువారం జరిగిన కార్యక్రమానికి ధోనీ తన టోపీ మరియు టీ షర్టుపై 'బలిదాన్ బ్యాడ్జ్' లోగో వేసుకున్నాడు. దీంతో అక్కడి యువ అభిమానులను ప్రోత్సహించాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్రికెట్కు తాత్కాలిక విరామం:
చివరిసారిగా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆడిన ధోనీ మైదానంలోకి దిగి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు.

స్నేహితులతో ధోనీ చిల్:
ఈ తాత్కాలిక విరామంను ధోనీ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కూతురు జీవాతో. గత ఆదివారం రాంచీకి దగ్గరల్లోని తన ఫామ్హౌజ్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోనీ చిల్ అయ్యాడు. చిన్ననాటి స్నేహితుడు లోహానీ బర్త్డే వేడుకలను ధోనీ తన ఫామ్హౌజ్లో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకులో ధోనీ స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. జీవా కూడా సందడి చేసింది. ధోనీ కేక్ కట్ చేసి లోహానీకి రుద్దాడు. అనంతరం జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాడు.


Click it and Unblock the Notifications
