హైదరాబాద్: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న చెన్నై సూపర్కింగ్స్ వివాదాల నుంచి బయటపడింది. మళ్లీ ఐపీఎల్ ఆడేందుకు రంగం సిద్ధం చేస్తుంది. టీంను యథాతథంగా ఉంచడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇంకా సంతోషంగా ఉన్నట్లు చైన్నై సూపర్కింగ్స్ జట్టు మేనేజర్ తెలిపారు.
చెన్నైకే ధోని: ఐపీఎల్ కొత్త గైడ్లైన్స్ ఇవే
రెండేళ్ల నిషేదం అనంతరం చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్), రాజస్థాన్ (రాజస్థాన్ రాయల్స్)లీగ్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ సందర్భమై జట్టు డైరక్టర్ జార్జ్ జాన్ మాట్లాడుతూ.. 'చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్ధం కావడంలేదు. ఇక మా జట్టును ముందుండి నడిపించేది ధోనీనే.' అన్నాడు.
అంతకుముందు సూపర్కింగ్స్ జట్టు యజమాని శ్రీనివాస్ కూడా ధోనినే మా కెప్టెన్ అని తెలిపిన సంగతి విదితమే. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్లలో ఆడబోతున్న ధోనీ ఐపీఎల్కు సిద్ధం కానున్నాడు. ఈ నెల 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు సిరీస్లకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించనున్న ధోనీ మళ్లీ తన శైలిలో విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.