ముంబై: భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్లో దిశా పఠానీ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో దిశా.. ధోనీ మాజీ ప్రియురాలిగా నటించనుందని తెలుస్తోంది. దిశా పఠానీ... టైగర్ ష్రాఫ్ ప్రియురాలు అనే ప్రచారం ఉంది.
ధోనీ బయోపిక్లో ఆయన మాజీ ప్రియురాలిగా దిశా పఠానీ అయితే బాగా సూటవుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై దర్శకుడు నీరజ్ పాండే ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ధోనీ జీవితం ఆధారంగా 'ఎంఎస్ ధోనీ - ద అన్టోల్డ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతోంది. ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుత్, భార్య సాక్షి పాత్రలో కైరా అద్వానీలు నటిస్తున్నారు.
దిశా 2013 ఏడాది ఫెమీనా మిస్ ఇండియా. ఆ తర్వాత ఆమె ఎన్నో మోడలింగ్ ప్రాజెక్టులు చేసింది. అంతేకాదు, ఈమె తెలుగు సినిమా 'లోఫర్'లోను నటించింది.