ముంబై ముగ్గురు ఆల్ రౌండర్లు
కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు కలిపి ముగ్గురు ఉన్న ఫొటోను ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేస్తూ.. 'వీళ్లలో ఉత్తమ ఆల్రౌండర్ ఎవరో చెప్పండి. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాం' అని తెలిపింది. దానికి కౌంటర్గా సన్రైజర్స్ హైదరాబాద్ ఇలా స్పందించింది.
ముంబైకు హైదరాబాద్ సమాధానం
వెయిట్ చేయడమెందుకు. ఇదే మా సమాధానమంటూ సన్రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. అందులో రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్ల ఫొటోను పెట్టి ట్వీట్ చేసింది.
ముంబై ఇండియన్స్కు సూపర్ కింగ్స్ స్పందిస్తూ:
ముంబై ఇండియన్స్ ట్వీట్పై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇదిగో మా ముగ్గురు వీరులు అన్నట్లు ధోనీని మూడు రూపాలలో ఉంచి పోస్టు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్కే మంచి స్పందన లభించింది.
హైదరాబాద్కు కౌంటర్ ఇచ్చిన ముంబై:
బంగ్లాదేశ్ క్రికెటర్లు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల ముగ్గురు ఫొటోలను ఉంచిన హైదరాబాద్కు కౌంటర్గా 'వెయిటింగ్ పూర్తవదు. ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది' అంటూ ట్వీట్ చేసింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ కెరీర్లో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ మాత్రం 2016 ఐపీఎల్లో మాత్రమే విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications













