|
చెట్టుపై కూర్చొని బిట్టూ భయ్యా
ఇందులో ధోనీతోపాటు పాండ్యా భోజ్పురిలో మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది. ధోనీ ఇందులో బిట్టూ భయ్యాగా కనిపించాడు. ఓ చెట్టుపై కూర్చొని బైనాక్యులర్స్లో దూరంగా జరుగుతున్న మ్యాచ్ను ఈ ఇద్దరు క్రికెటర్లు చూస్తున్నట్లుగా యాడ్ను చిత్రీకరించారు. ధోనీ, పాండ్యా చాలా సహజంగా నటిస్తూ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ వీడియోను పాండ్యా తన ట్విటర్లో షేర్ చేశాడు. కేవలం రూ.49కే స్టార్ నెట్వర్క్కు సంబంధించిన అన్ని చానెల్స్ వస్తాయని చెప్పడమే ఈ యాడ్ ఉద్దేశం.
వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా వెళ్లనున్న ధోనీ, పాండ్యా
ఆస్ట్రేలియా పర్యటనకు ఇప్పటివరకు దూరమైన ఈ ఇద్దరూ వన్డే జట్టులో ఎంపికయ్యారు. త్వరలోనే టీమిండియా శిక్షణలో పాల్గొననున్నారు. ఆసియా కప్ జరుగుతుండగా హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఫిట్నెస్ సాధించి మళ్లీ జట్టులోకి చేరనున్నాడు. ఫామ్ లేమి కారణంగా టీమిండియాకు దూరమైన వన్డే సిరీస్కు ఎంపికై జట్టులో చేరనున్నాడు.
మెల్బౌర్న్ వేదికగా గెలిచి చారిత్రక విజయం
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టు సిరీస్లో భాగంగా ఆదివారం మూడో టెస్టులో విజయం సాదించింది. బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా జరిగిన ఈ మ్యాచ్ను మెల్బౌర్న్ వేదికగా గెలిచి చారిత్రక విజయం సాధించింది. దీంతో కెప్టెన్ కోహ్లీకి కూడా మరిన్ని అరుదైన ఘనతలు సాధించాడు.