|
మెరుపు స్టంపింగ్ చేసిన ధోని
న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు టీమ్ సీఫెర్ట్ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కొలిన్ మున్రో (72: 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ ఆరంభంలో ప్రమాదకరంగా కనిపించిన టిమ్ సీఫెర్డ్ను ధోనీ ఓ మెరుపు స్టంపింగ్తో ఔట్ చేశాడు.
— रति शंकर शुक्ल (@rati_sankar) February 10, 2019 |
రెప్పపాటు కాలంలో
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రెప్పపాటు కాలంలో బంతిని అందుకొని ధోని వికెట్లను గిరాటేసి సీఫెర్డ్ను పెవిలియన్కు చేర్చాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కివీస్ విధ్వంసక ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (43: 25 బంతుల్లో 3x4, 3x6) క్రీజు వెలుపలికి వెళ్లి బంతిని ముందుకు ఫుష్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యాట్కి అందని బంతి నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. రెప్పపాటులో బెయిల్స్ను పడగొట్టిన ధోనీ.. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్కి నివేదించాడు. రిప్లైలో సెకనులోపే ధోనీ స్టంపౌట్ చేయగా.. ఆ సమయంలో సీఫర్ట్ పాదం క్రీజు లోపల లేదని తేలడంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
4 ఓవర్లలో 54 పరుగులిచ్చిన పాండ్యా
కృనాల్ పాండ్యా అయితే 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ 4 ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ 37 పరుగులు, ఖలీల్ అహ్మద్ 47 పరుగులు ఇచ్చారు. కుల్దీప్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.