
కేన్ విలియమ్సన్
అభిమానులతో ఎంతగానో కలిసిపోయిన డేవిడ్ వార్నర్పై వేటు వేసి మరీ కేన్ విలియమ్సన్ను కెప్టెన్గా నియమించింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. కానీ అతను కూడా అత్యంత పేలవంగా ఆడాడు. జట్టుకు విజయాలు అందించడంలో కూడా విఫలమయ్యాడు. దీంతో రూ.14 కోట్ల విలువైన ఈ కివీస్ సారధిని సన్రైజర్స్ జట్టు వదిలించుకుంది.

మయాంక్ అగర్వాల్
కేఎల్ రాహుల్ జట్టును వీడటంతో అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ పగ్గాలు అందుకున్నాడు మయాంక్ అగర్వాల్. జట్టుతో ఎప్పటి నుంచో కలిసి ఉన్న అతను.. కెప్టెన్ అయిన తర్వాత అత్యంత చెత్తగా ఆడాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా జట్టుకు శుభారంభం అందించలేకపోయాడు. దీంతో అతన్ని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసేసింది. అతని ధర కూడా రూ.14 కోట్లే కావడం గమనార్హం.

నికోలస్ పూరన్
భారీ అంచనాలతో నికోలస్ పూరన్ను రూ.10.75 కోట్లు పెట్టి మెగా వేలంలో కొనుగోలు చేసింది సన్రైజర్స్ యాజమాన్యం. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసిన పూరన్.. సన్రైజర్స్ తరఫున పెద్దగా రాణించలేదు. ఒకటీ అరా తప్ప మిగతా అన్ని మ్యాచుల్లో చేతులెత్తేశాడు. దీంతో ఈ మినీ వేలం ముందు అతన్ని కూడా సన్రైజర్స్ యాజమాన్యం వదిలించేసుకుంది.

జేసన్ హోల్డర్
మినీ వేలానికి ముందు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ జట్టు మేనేజ్మెంట్ అనూహ్యంగా కరీబియన్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను వదిలేసుకుంది. మెగా వేలంలో రూ.8.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అతను.. లక్నో తరఫున ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్లో పెద్దగా రాణించకున్నా బంతితో కొన్ని మ్యాచుల్లో గెలిపించాడు.

రొమేరియో షెఫర్డ్
ఈసారి అత్యంత ఖరీదైన ఆటగాళ్లను వదులుకున్న జట్టు సన్రైజర్స్ హైదరాబాదే. విలియమ్సన్, పూరన్ ఇద్దరినీ వదిలేసిన ఆ జట్టు.. అక్కడితో ఆగలేదు. వెస్టిండీస్ బౌలర్ రొమేరియో షెఫర్డ్ను కూడా రిలీజ్ చేసేసింది. గతేడాది మెగా వేలంలో అతన్ని రూ.7.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సన్రైజర్స్.. ఈసారి కఠిన నిర్ణయం తీసుకొని షెఫర్డ్ను వదిలించేసుకుంది. అతను కూడా సన్రైజర్స్ తరఫున పెద్దగా రాణించిందేం లేదు.


Click it and Unblock the Notifications












