న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై vs చెన్నై మ్యాచ్ ఫిక్సయిందా?: కేఆర్‌కే ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక

IPL 2019 : Ambani Money Power Won IPL Final For Mumbai,Tweets Kamaal Rashid Khan || Oneindia Telugu
Money Can Do Anything In This World, Says KRK On Mumbai Indians’ Title Win

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కావాలనే ఓడిపోయిందా? అంటే అవుననే అంటున్నాడు బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్లు టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్లు. లీగ్ స్టేజిలో అత్యధిక విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక, ఫైనల్ విషయానికి వస్తే చెన్నై అనవసర రనౌట్లతో మ్యాచ్ చేజార్చుకుంది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై కమల్ ఆర్ ఖాన్

అయితే, ఈ రనౌట్ల వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. "ధోని, రైనా, అంబటి రాయుడు బలవంతంగా రనౌటయ్యారు. ఆఖరి ఓవర్‌లో షేన్ వాట్సన్ అనవసర రనౌట్ అవడం అనేది అంబానీ భారత్‌లో ఏమైనా చేయగలడు అనే దానికి నిదర్శనం. ఈ ప్రపంచంలో డబ్బు ఏదైనా చేయగలదు" అని ట్వీట్ చేశాడు.

ఆఖరి ఓవర్ ముందు వరకు

ఆఖరి ఓవర్ ముందు వరకు

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ముందు వరకు విజయం చెన్నై సూపర్ కింగ్స్‌దేనని అంతా భావించారు. 76 పరుగులతో షేన్ వాట్సన్ సూపర్ ఫామ్‌లో ఉండగా... అతనికి తోడు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. దీంతో చెన్నై తప్పక విజయం సాధిస్తుందని మ్యాచ్‌ని వీక్షించేవారంతా భావించారు.

ఒక పరుగు తేడాతో ముంబై విజయం

ఒక పరుగు తేడాతో ముంబై విజయం

దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తద్వారా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.

ఆఖరి ఓవర్‌లో అంతా తారుమారు

ఆఖరి ఓవర్‌లో అంతా తారుమారు

అయితే, లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్‌లో అంతా తారుమైంది. మొదటి మూడు బంతుల్లో చెన్నై నాలుగు పరుగులు చేసింది. డబుల్ సాధించే క్రమంలో షేన్ వాట్సన్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆఖరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో శార్ధూల్ ఠాకూర్ అనూహ్యంగా ఔటయ్యాడు.

Story first published: Tuesday, May 14, 2019, 16:55 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X