
హైదరాబాద్: అతి కష్టంపై మ్యాచ్ ను కొనసాగించిన బంగ్లాదేశ్ ను మోమినల్ ఆదుకున్నాడు. దీంతో పరుగుల వరద పారిన బంగ్లా, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో భారీ శతకం (176) సాధించిన మొమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ (105; 174 బంతుల్లో 5×4, 2×6)తో సత్తాచాటడంతో బంగ్లా డ్రాతో బయటపడింది.
119 పరుగులు వెనకబడి ఓవర్నైట్ స్కోరు 81/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా మ్యాచ్ ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో 307 (5 వికెట్లకు) పరుగులు చేసింది. లిటన్ దాస్ (94; 182 బంతుల్లో 11×4), తమీమ్ ఇక్బాల్ (41) రాణించారు.
లంక స్పిన్నర్ హెరాత్ రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 513 పరుగులు చేసింది. అంతకుముందు లంక 713/9 వద్ద డిక్లేర్ చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.