భారత్లో జరగనున్న ఆసియా కప్ 2025పై ఇప్పుడు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీలోని కొన్ని అంశాలపై చర్చించడానికి ఆసియా క్రికెట్ కంట్రోల్ (ACC) ఢాకాలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ సమావేశం ఢాకాలో జరగడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వ్యతిరేకిస్తోంది. బీసీసీఐ ఈ సమావేశం ఢాకాలో జరగకూడదని కోరుకుంటుండగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఈ సమావేశం ఢాకాలో జరగాలని పట్టుబడుతున్నారు. దీనిపై బీసీసీఐ అధికారికంగా మొహ్సిన్ నఖ్వీకి తెలియజేసింది. ఏసీసీ సమావేశం ఢాకాలో జరిగితే తాము అందులో పాల్గొనబోమని. భారత్తో పాటు మరో 3 దేశాల బోర్డులు కూడా ఢాకాలో జరగనున్న ఈ సమావేశానికి వ్యతిరేకంగా బీసీసీఐకి మద్దతు ఇస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య క్షీణించిన రాజకీయ సంబంధాల కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎవరి ఒత్తిడితో మొహ్సిన్ నఖ్వీ ఇలా చేస్తున్నారు?
మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్గా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా, పాకిస్థాన్ హోంమంత్రిగా కూడా ఉన్నారు. కావున పాకిస్థాన్ రాజకీయ నాయకుల జోక్యం కారణంగా మొహ్సిన్ నఖ్వీ ఏసీసీ సమావేశాన్ని ఢాకాలో నిర్వహించాలని పట్టుబడుతుండవచ్చని, దీనిని బీసీసీఐ వ్యతిరేకిస్తున్నాయని ఊహాగానాలున్నాయి. చాలా కాలంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏదో ఒక విషయంలో బీసీసీఐ నిర్ణయాలలో అడ్డుపడుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బలవంతంగా టీమిండియాను పాకిస్థాన్ కు ఆడేందుకు రమ్మని పిలిచింది. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీమిండియాతో ఐసీసీ టోర్నమెంట్లలో ఆడబోమని బెదిరించింది.

మొహ్సిన్ నఖ్వీ పదవికి ముప్పు?
జై షా ఐసీసీ ఛైర్మన్ అయిన తర్వాత మొహ్సిన్ నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమించారు. మొహ్సిన్ నఖ్వీ అధ్యక్షతన ఇప్పుడు ఆసియా కప్ టోర్నమెంట్పై ఇప్పటికే సంక్షోభం నెలకొంది. మొహ్సిన్ నఖ్వీ సమావేశాన్న ఢాకాలో నిర్వహించాలని పట్టుబడితే టీమిండియా ఆసియా కప్ 2025 ఆడకపోవచ్చు. ఒకవేళ అలా జరిగితే బీసీసీఐ మొహ్సిన్ నఖ్వీకి వ్యతిరేకంగా పోరాడి అతడిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.
సెప్టెంబరులో ఆసియా కప్ 2025 నిర్వహించడానికి నిర్ణయించారు. ఇప్పుడు సెప్టెంబరులో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో కూడా ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు పాకిస్తాన్తో ఆడటానికి నిరాకరించారు, దీని కారణంగా మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది.