
ఏడాదిన్నర క్రితం ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్
మోహిత్ ఎవరో కాదు... దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగేందుకు సిద్ధమైన సమయంలో ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగాడు. వికెట్ కీపర్గా జట్టులోకి అడుపెట్టాడు. పానిపట్కు చెందిన ట్రక్డ్రైవర్ కొడుకైన మోహిత్ 2015-16 రంజీ సీజన్లో ఢిల్లీ తరుపున మూడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు.

మూడు మ్యాచుల్లో 5 పరుగులే
ఈ మూడు మ్యాచుల్లో అతడు చేసింది కేవలం 5 పరుగులే. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉండటంతో మరో అవకాశం ఆడే అవకాశం రాకుండానే కనుమరుగయ్యాడు. అయితే తాజాగా ఫ్రెండ్స్ ప్రెమీయర్ లీగ్లో భాగంగా మావి ఎలెవెన్, ఫ్రెండ్స్ ఎలెవెన్ జట్ల మధ్య మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్లో 300 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

12 బంతుల్లోనే 50 పరుగులు చేసిన మోహిత్
18 ఓవర్ వద్ద మోహిత్ వ్యక్తిగత స్కోరు 250. ఆ తర్వాత 12 బంతుల్లోనే మోహిత్ 50 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది 34 పరుగులు సాధించాడు. దీంతో మావీ లెవన్ 416 పరుగులు చేసింది. ఆ తర్వాత 417 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఫ్రెండ్స్ లెవన్ 216 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

తొలి బంతి నుంచే దూకుడుగా ఆడా
మ్యాచ్ అనంతరం మోహిత్ మాట్లాడుతూ ‘తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకొని ఎదురుదాడికి దిగాను. అన్నీ బాగా కలిసి రావడంతో పరుగులు వరదలా పారాయి. మరో ఐదు ఓవర్లు ఉన్న సమయంలో 200కు చేరాను. మరింత దూకుడుగా ఆడుతూ బ్యాటింగ్ చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. 300 పరుగుల కోసం ప్రయత్నిస్తానని నా సహచరుడితో చెప్పాను' అని మోహిత్ పేర్కొన్నాడు.

జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యం
‘గౌతీ భాయ్ నా ప్రదర్శన గురించి తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నా. అయితే ఈ ఒక్క మ్యాచ్ నాకు ఐపీఎల్ అవకాశం ఇప్పిస్తుందా అనేది చెప్పలేను' అని మోహిత్ చెప్పాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని చెప్పాడు. తాజాగా వేలం కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో మోహిత్ పేరు కూడా ఉంది.


Click it and Unblock the Notifications











