
సెకండ్ రన్ తీయలేక..
చివరి ఓవర్లో అక్షర్తో జరిగిన సంభాషణ గురించి సిరాజ్ ప్రస్తావించాడు. ఇక ఈ మ్యాచ్ చివరి ఓవర్లో భారత్ విజయానికి 8పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ తొలుత డాట్ బాల్ ఆడాడు. ఇక రెండో బంతికి షాట్ ఆడగా సింగిల్ వచ్చింది. అయితే సెకండ్ రన్ కోసం ప్రయత్నించినప్పటికీ.. సిరాజ్, అక్షర్ మధ్య సమన్వయం కొరవడింది. దీంతో సింగిల్కే పరిమితమయ్యారు. మూడో బంతికి సిరాజ్ సింగిల్ తీసివ్వగా.. నాలుగోబంతికి అక్షర్ లో ఫుల్ టాస్ బంతికి సిక్స్ కొట్టి విజయ లాంఛనాన్ని ముగించాడు. ఇక సెకండ్ రన్ కోసం ఎందుకు పరుగెత్తలేదు అంటూ ప్రజెంటేటర్ అడగ్గా సిరాజ్ ఫన్నీగా బదులిచ్చాడు.

ఆ క్షణం నేనే సిక్స్ కొట్టేస్తే పోలా అనిపించింది
'నిజమే రెండో బంతికి డబుల్ తీయాల్సింది. కానీ ఔటయ్యే అవకాశాలున్నట్లు కన్పించింది. అవతలి ఎండ్లో అక్షర్ భాయ్ బాగా ఆడుతున్నాడు. ఆ ఓవర్కు ముందు మేం చర్చించుకున్నాం కూడా. తానే క్రీజులో ఉండేలా చూసుకుందామని ఇరువురం అనుకున్నాం. అయితే రెండో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. ఇకపోతే మూడో బంతికి ఆ టైంలో ఒక్క క్షణం నేనే సిక్స్ కొట్టేస్తే పోలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ అది రిస్కీ విషయమని.. ఎలాగోలా సింగిల్ తీసిస్తే అక్షర్ మిగతా పని చూసుకుంటాడని సర్ది చెప్పుకుని సింగిల్ తీసిచ్చా. తర్వాత జరిగింది మీకు తెలిసిందే' అంటూ సిరాజ్ పేర్కొన్నాడు.

312పరుగుల భారీ టార్గెట్ ఛేదన
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. షై హోప్ (135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 115) సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో అక్షర్ పటేల్ దండెత్తి మ్యాచ్ను ఇండియా చేతిలో పెట్టాడు.


Click it and Unblock the Notifications
