
ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సింది
'ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సెలెక్షన్ కమిటీ ప్లాన్ చేయాల్సింది. అక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగిందనేది అర్థమవుతుంది. కేఎల్ రాహుల్ ఆలస్యంగా జట్టులో చేరి ఉండొచ్చు. జట్టును ప్రకటించినప్పుడే ధావన్ కెప్టెన్ అని పేర్కొన్నప్పుడు.. రాహుల్ అందుబాటులోకి వస్తే అతన్ని కెప్టెన్ అని పేర్కొనాల్సి ఉండేది. ప్రస్తుతం రాహుల్ ఆసియా కప్ కోసం వెళ్లాల్సి ఉంది. అంతకుముందు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. కాబట్టి తిరిగి జట్టులోకి తీసుకోవడం మంచిదే. అతను శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడితే ఏం పోయేది. ధావన్ కెప్టెన్సీలో ఆడడం వల్ల పెద్ద తేడా ఏం ఉండదు' అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

ధావన్ పెద్దగా పట్టించుకోడు కానీ అతనికి ఇలా జరగొద్దు
'ఎవరినైనా కెప్టెన్గా ప్రకటిస్తే.. కమ్యూనికేషన్ మెరుగ్గా ఉండాలి. తీసేస్తున్నామని చెప్పేస్తే ప్లేయర్కు ప్రశ్నించే అవకాశం ఉండదు. శిఖర్ ధావన్ విషయంలో జరిగింది మంచిది కాదు. అతను ప్లేయర్గా చాలా కూల్గా వ్యవహరించాడు. అతనో స్పోర్టివ్ నెస్ ప్లేయర్. అతను ఈ తతంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఏదేమైనా కెప్టెన్సీ మార్పు విషయంలో శిఖర్ ధావన్కి జరిగింది సరైనది కాదు' అని కైఫ్ చెప్పాడు. ఇకపోతే శిఖర్ ధావన్లో చాలా క్రికెట్ మిగిలి ఉందని, అతను ఇప్పుడు ఒక ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడని, కానీ మూడు ఫార్మాట్లలో ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్ అని పేర్కొన్నాడు.

జింబాబ్వేతో మూడు వన్డేలకు ఎంపికైన భారత జట్టు:
కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్ ), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.


Click it and Unblock the Notifications












