
ధోనీనే ఫాస్టెస్ట్ రన్నర్:
కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా మాజీలు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హలో లైవ్ సెషన్లో పాల్గొన్న మహ్మద్ కైఫ్ పలు విషయాలపై చర్చించాడు. 'వికెట్ల మధ్య ధోనీ చాలా వేగంగా పరుగెత్తుతాడు. నేను కూడా అతనితో కలిసి సింగిల్స్, డబుల్స్ తీశా. ఆ అనుభవంతో చెప్తున్నా.. అతని వేగం అమోఘం. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో ధోనీనే ఫాస్టెస్ట్ రన్నర్' అని కైఫ్ఆ అన్నాడు. మహ్మద్ కైఫ్ భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు.

బిర్యానీ తింటాడు.. కానీ అలా ఎలా:
'ఎంఎస్ ధోనీ పెద్దగా జిమ్కి వెళ్లడు. ఇతర ఆటగాళ్లలా అస్సలు కష్టపడడు. ఇక బటర్ చికెన్, బిర్యానీలను బాగానే లాగించేస్తాడు. అయినప్పటికీ వేగంగా ఎలా వికెట్ల మధ్య పరుగు తీయగలుగుతున్నాడో ఇప్పటికీ నాకు అర్ధం కావడం లేదు. ఆ రోజుల్లో నేను మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నానని అనుకునేవాడ్ని. కానీ ధోనీ వచ్చాక నా అభిప్రాయం మారింది. మహీది న్యాచురల్ ఫిట్నెస్' అని మహ్మద్ పేర్కొన్నాడు.

ఆ రోజుల్లో యో-యో ఫిట్నెస్ ఉంటే:
'క్రికెటర్కి ఫిట్నెస్ చాలా ముఖ్యం. నేను క్రికెట్ ఆడే రోజుల్లో యో-యో ఫిట్నెస్ టెస్టు లేదు. ఒకవేళ ఉండింటే.. నేను, లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ మాత్రమే పాసయ్యేవాళ్లం. నా అంచనా ప్రకారం జట్టులోని మిగిలిన వాళ్లెవరికీ ఆ ఫిట్నెస్ ప్రమాణాలని అందుకునే సామర్థ్యం అప్పట్లో లేదు' మహ్మద్ కైఫ్ అని చెప్పుకొచ్చాడు.

కైఫ్ కారణంగానే రనౌట్:
బంగ్లాదేశ్తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఎంఎస్ ధోనీ.. మహ్మద్ కైఫ్ కారణంగానే ఆ మ్యాచ్లో రనౌట్గా.. అదీ డకౌట్గా వెనుదిరిగాడు. ధోనీ సింగిల్ కోసం కైఫ్ని పిలవగా.. కాస్త ముందుకు వచ్చి అనూహ్యంగా పరుగుకి నో చెప్పాడు. దాంతో అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన ధోనీకి మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ విశాఖ తీరాన విధ్వంసంతో (123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్లతో 148 రన్స్) ధోనీ మైదానంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా నిలిచాడు.


Click it and Unblock the Notifications












