Mohali Crowd today #INDvsAUS pic.twitter.com/MBDWcbr8Ht
— POWERSTAR (@Teja_PSPK99) March 10, 2019
పంత్ విఫలమైన ప్రతిసారీ స్టేడియంలో
ఈ మ్యాచ్లో వికెట్ల వెనుక పంత్ విఫలమైన ప్రతిసారీ స్టేడియంలోని అభిమానులు ధోనీ.. ధోనీ అంటూ అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెప్టెన్ కోహ్లీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని గట్టిగా అరుస్తూ.. ‘విరాట్ భాయ్ ధోనీ కో బులావో' అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
44వ ఓవర్లో చాహల్ బౌలింగ్ చేస్తుండగా
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 44వ ఓవర్లో చాహల్ బౌలింగ్ చేస్తుండగా టర్నర్ క్రీజు నుంచి కాస్త ముందుకు వెళ్లాడు. బంతి వైడ్గా వెళ్లడంతో పంత్ దాన్ని అందుకోలేకపోయాడు. టర్నర్ను ఔట్ చేసే మంచి అవకాశం చేజారింది. అప్పటికి అతడు 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశం తర్వాత టర్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ధోనీని కాపీ కొట్టబోయిన పంత్
ఆ తర్వాత మరో 16 బంతుల్లో 46 పరుగులు చేసి 13 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియాకు విజయాన్నందించాడు. అలాగే మరోసారి కారేను స్టంపింగ్ చేసే అవకాశాన్ని సైతం పంత్ చేజార్చాడు. ధోనీ మాదిరి వికెట్లని చూడకుండా బంతిని విసరడం ద్వారా స్టంపౌట్ మిస్సైంది. దీంతో స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ అంటూ కేకలు వేశారు.
ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం
నాలుగో వన్డేలో ఓటమితో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ఈ మ్యాచ్లో 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 84 నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆసీస్ ఆటగాడు టర్నర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.