సెల్ఫీ ఇవ్వలేదని..
ఈ సమయంలో వాళ్లు మరోసారి సెల్ఫీ అడిగారు. దీనికి నిరాకరించిన పృథ్వీ షా పక్కకు వెళ్లిపోయాడు. ఈ ఘటన ముంబైలోని సహారా స్టార్ హోటల్లోని మ్యాన్షన్ క్లబ్లో జరిగింది. అయితే తమకు సెల్ఫీ ఇవ్వలేదని ఆగ్రహం తెచ్చుకున్న ఈ దుండగులు.. హోటల్ బయట పృథ్వీ షా కోసం కాపుకాశారు. అతను తన స్నేహితుడితోపాటు బయటకు రావడం చూశారు. ఆ తర్వాత కారును వెంబడించి ఒక పెట్రోల్ పంప్ సమీపంలో దానిపై దాడి చేశారు.

బేస్ బాల్ బ్యాట్లతో దాడి..
బేస్ బాల్ బ్యాట్లతో కారు అద్దాలు పగలగొట్టేశారు. తీరాచూస్తే ఆ కారులో పృథ్వీ షా లేడు. అతను వేరే కారులో వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పించుకున్నాడు. కానీ అతని స్నేహితుడు మాత్రం ఆ దుండగులకు దొరికిపోయాడు. కారు నాశనం చేయడంతో ఆగని ఆ దుండగులు.. కారు యజమానిని బెదిరించి తమకు రూ.50 వేలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కూడా చేశారట. వారి నుంచి తప్పించుకున్న తర్వాత ఈ ఘటనపై పృథ్వీ షా స్నేహితుడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలు ఏమైందంటే?
సానా గిల్, శోభిత్ ఠాకూర్ అనే ఇద్దరు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరూ పృథ్వీ షాతో ఒకసారి సెల్ఫీ దిగారు. ఆ తర్వాత మళ్లీ వెళ్లి తమకు సెల్ఫీ కావాలని అడగడంతో షా నిరాకరించాడు. వాళ్లు అతన్ని ఇబ్బంది పెట్టడంతో హోటల్ మేనేజర్ వచ్చి వారిని బయటకు సాగనంపాడు. ఈ కోపంతోనే పృథ్వీ షాపై దాడి చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. స్నేహితుడి కారులోనే షా వెళ్తున్నాడని భావించారు. ఈ నేపథ్యంలోనే స్నేహితులతో కలిసి వచ్చి ఆ కారుపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్టున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications












