
చాలా నిరాశ చెందా
కామెంటేటర్ లిసా షలేకర్తో మిథాలీ రాజ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు. 'నేను, జులన్ గోస్వామి కలిసి చాలా ఏళ్లు టీమిండియాకు ఆడాం. 4-5 ప్రపంచకప్ టోర్నీల్లో బరిలోకి దిగాం. అయినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయాం. ఇది నిజంగా చాలా బాధిస్తున్నది. 2021 ప్రపంచకప్లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నా, అందుకోసం కష్టపడుతున్నా. ఇద్దరం ఫిట్నెస్పై ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది' అని మిథాలీ చెప్పారు.

2017లో కంటే చురుగ్గా ఉంటా
కోవిడ్ -19 సంక్షోభం త్వరలోనే తొలగిపోతుందని, న్యూజిలాండ్లో జరిగే మహిళల ప్రపంచకప్ వరకు భారత్ రెండు సిరీస్లు ఆడాలని భావిస్తున్నట్లు మిథాలీ రాజ్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా జూన్లో ప్రారంభం కావాల్సిన భారత మహిళల జట్టు.. ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడింది. కరోనా లాంటి సంక్షోభం ఎవరూ ఊహించరని మిథాలీ పేర్కొన్నారు. కరోనా సమయాన్ని ఉపయోగించుకుంటా, నేను 2017లో కంటే చురుగ్గా ఉంటానని ధీమా వ్యక్తం చేసారు. మిథాలీ, జులన్ ఇప్పటికే టీ20ల నుంచి రిటైవగా.. వన్డేలపైనే పూర్తి దృష్టిసారించారు. న్యూజిలాండ్లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.

16 ఏళ్ల వయసులో అరంగేట్రం
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసారు. ఇక 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గుర్తింపు సాధించారు. 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మిథాలీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. ఇక వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించారు.

పైనల్లో ఓటమి:
వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. సచిన్ కూడా సరిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో పరుగులు చేసాడు. 2008-12 మధ్యలో ఐదేళ్లు మినహాయిస్తే.. 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్గా ఉంది. మిథాలీ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్కు వెళ్లింది. పైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది.

వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు:
అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా మిథాలీ చరిత్ర సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 663, వన్డేలలో 6888, టీ20లలో 2364 పరుగులు చేసారు.


Click it and Unblock the Notifications












