Mitchell Owen IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఇప్పుడు ముగిసింది. సరిహద్దులో ఇప్పుడు పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్, పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్)లను మధ్యలో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్లు మే 17 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ మ్యాచ్లు కూడా ఈ తేదీ నుంచి జరుగుతాయి.
భద్రతా కారణాల దృష్ట్యా విదేశీ ఆటగాళ్లందరూ రెండు టోర్నమెంట్ల నుంచి నిష్క్రమించి తిరిగి ప్రారంభమవుతుందనే సమయంలో మళ్లీ తిరిగి వచ్చారు. ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ ఆటగాడు పీఎస్ఎల్ 2025 టోర్నీలో పాల్గొనడానికి పాకిస్థాన్ చేరుకోవలసి ఉంది. కానీ ఈ ఆటగాడు పాకిస్థాన్ సూపర్ లీగ్ను విడిచిపెట్టి ఐపీఎల్లో ఆడటానికి వచ్చాడు. ఆ విధ్వంసక ఆసీస్ బ్యాటర్ పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు.

ఐపీఎల్లో ఆడేందుకు పీఎస్ఎల్ను వదిలేశాడు..
ఐపీఎల్ ఆడటానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ను మధ్యలో వదిలిపెట్టిన ఆటగాడి పేరు మిచెల్ ఓవెన్. గ్లెన్ మ్యాక్స్వెల్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న తర్వాత అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ మిచెల్ ఓవెన్ను జట్టులోకి తీసుకుంది. పీఎస్ఎల్లో బాబర్ ఆజం కెప్టెన్సీలో పెషావర్ జల్మీ తరఫున ఆడిన తర్వాత మిచెల్ ఓవెన్ పాకిస్థాన్ సూపర్ లీగ్లోనే మళ్లీ ఆడతాడని భావించారు. కానీ మిచెల్ ఓవెన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ను విడిచిపెట్టి ఐపీఎల్లో పాల్గొనడానికి భారత్కు చేరుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తమ ఎక్స్ ఖాతాలో మిచెల్ ఓవెన్ ఫోటోను కూడా షేర్ చేసింది.
ఆసీస్ క్రికెటర్ మిచెల్ ఓవెన్ తన విస్పోటక బ్యాటింగ్కు ప్రసిద్ధి చెందాడు. బిగ్ బాష్ లీగ్లో తన బ్యాటింగ్తో మిచెల్ ఓవెన్ సంచలనం సృష్టించాడు. చివరి మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడుతూ మిచెల్ ఓవెన్ తన జట్టును ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ ఓవెన్ 42 బంతుల్లో 108 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 257 స్ట్రైక్ రేట్తో ఆడిన ఈ ఆసీస్ క్రికెటర్ 11 అద్భుతమైన సిక్సర్లు కొట్టి చివరి మ్యాచ్ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశాడు. ఐపీఎల్లోని మిగిలిన మ్యాచ్లలో మిచెల్ ఓవెన్ నుంచి పంజాబ్ జట్టు అలాంటి ప్రదర్శనను ఆశిస్తుంది.