|
కొన్ని రోజులుగా చర్చ తరుణంలో
కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా ఆడుతున్న ఒక్క సిరీస్లోనూ విజయం దక్కించుకోలేకపోతుంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయిన ఆసీస్ అభిమానులు ఆ ముగ్గురిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని కోరుకుంటున్నారు. భారత్తో స్వదేశంలో జరగనున్న సిరీస్లో ఆడించాలంటూ పలువురు ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న తరుణంలో జాన్సన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని చోటు చేసుకుంటున్నాయి.
|
అవసరం లేదని అనుకుంటున్నా
ఆసీస్ జట్టు ఆ ముగ్గురు ఆటగాళ్లను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. దీన్ని వారు అంగీకరిచారు. అలాంటప్పుడు నిషేధం ఎత్తేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానని జాన్సన్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే విధంగా స్పందించారు.
|
నిషేధాన్ని ఎత్తేసి సిరీస్లో ఆడనిస్తే
వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసి, ఇండియాతో జరగనున్న సిరీస్లో ఆడనిస్తే మళ్లీ అదే బాటలో నడిచే అవకాశం ఉంది. నిషేధం పూర్తిగా అమలు చేయాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.