
భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా
జోగిందర్ వేసిన రెండో బంతిని మిస్బా సిక్స్ బాదాడు. ఈ దెబ్బతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. పాక్ విజయానికి ఇంకా నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. జోగిందర్ మూడో బంతిని వేశాడు. మిస్బా స్కూప్ షాట్కు ప్రయత్నించి ఫైన్లెగ్ దిశగా ఆడాడు.

భారత శిబిరంలో వెల్లువిరిసిన ఆనందం
ఆ బంతి గాల్లోకి ఎగిరి శ్రీశాంత్ చేతిలో పడింది. భారత శిబిరంలో ఒక్కసారి ఆనందం వెల్లువిరిసింది. సఫారీ గడ్డపై నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించడంతో అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

మిస్బా స్కూల్ షాట్పై అభిమానులు
స్కూప్ షాట్ ఆడిన మిస్బాను మాత్రం పాక్ అభిమానులు ఎన్నటికీ మరచిపోలేరు. ఆ మ్యాచ్లో మిస్బా స్కూప్ షాట్ ఆడటం వల్లే పాక్ ఓటమి పాలైందని అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఈ షాట్పై న్యూస్వన్.టీవికి ఇచ్చిన ఇంటర్యూలో మిస్బా ఉల్ హక్ స్పందించాడు.
ఎటువంటి బాధ లేదన్న మిస్బా
'ఆ రోజు అలా ఆడినందుకు తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. దాని గురించి తాను చింతించడం లేదు' అని తేల్చి చెప్పాడు. అయితే, ఆ బాధ తనను చాలా రోజులు వేధించిందని, ఆ తర్వాత క్రమంగా దాని నుంచి బయటపడ్డానని పేర్కొన్నాడు. ప్రస్తుత క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ కెప్టెన్ అని మిస్బా కొనియాడాడు.


Click it and Unblock the Notifications












