
వ్యతిరేకించే వాళ్లు విభజన కోరుకునేవారు
'దసరా అంటే అందరూ జరుపుకునే పండుగ.. భారత క్రికెటర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. మహ్మద్ షమీ కూడా జరుపుకుంటే సమస్య ఏంటి?.. వ్యతిరేకించే వాళ్లే దేశ విభజనను కోరుకునేవాళ్లు. కానీ నిజమైన భారతీయులు ప్రతి పండగను ఆరాధించాలి, గౌరవించాలి. తద్వారా ఇదంత మనదేశం అనే భావనను తీసుకురావాలి. ప్రతి మతస్థుడు అన్ని పండుగలను జరుపుకోవాలి' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

షమీ పాపానికి ఒడిగట్టాడంటూ రభస
షమీ దసరా శుభాకాంక్షలు తెలపడం పట్ల నెటిజన్లు అతని మీద చాలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దసరా శుభాకాంక్షలు పంచుకోవడం పాపమంటూ షమీ పాపానికి ఒడిగట్టాడంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు. మరో నెటిజన్.. భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించడానికి ఈ సందర్భాన్ని షమీ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. షమీ మతానికి విరుద్ధమైన ప్రకటనతో ఆశ్చర్యపరిచాడని, అతనిపై ఫత్వా విధించాలంటూ ఖండించారు. మరొకరు 'షమీ నీ గురించి తలుచుకుంటే షేమ్ అనిపిస్తుంది. నువ్వు రాముడికి విశ్వాసివా' అంటూ మండిపడ్డాడు.
షమీని సమర్థిస్తూ కొందరు నెటిజన్ల పోస్టులు
ఇక మరికొందరు మాత్రం షమీ చేసింది ముమ్మాటికీ సరైన పనే అని పేర్కొన్నారు. ముందు మనందరం భారతీయులం ఆ తర్వాతే మతం అనే విషయాన్ని గుర్తుంచుకుని సోదరభావంతో ఇరు మతాల సంప్రదాయాలు గౌరవించడమే అసలైన భారతీయుడి లక్షణం అంటూ షమీకి మద్దతు పలికారు. షమీ ఏ మతానికి చెందినవాడు కాదు.. ప్రతి భారతీయుడు ఆరాధించే క్రికెట్ అనే మతానికి చెందినవాడు.. అంటూ షమీ ప్రొఫెషన్ను కొందరు హైలెట్ చేశారు.
ఇంకొందరు విడదీసే పలుకులతో మీరు షమీ మనస్సును ఏమార్చలేరు.. పండుగకు శుభాకాంక్షలు చెప్పేది సర్వసాధారణమైన లక్షణం.. అది షమీ కాదు ప్రపంచంలోని ఏ ముస్లిం నేత చేసిన తప్పే కాదు అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications












