లండన్: ప్రపంచకప్ క్రికెట్ మెగా టోర్నమెంట్ ముగింపు దశకు వచ్చేసింది. మరో నాలుగైదు రోజుల్లో లీగ్ మ్యాచులన్నీ ముగిసిపోతాయి. ఇక సెమీ ఫైనల్ ఆరంభమౌతుంది. ఈ నెల 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగబోతున్నాయి. తొలి సెమీఫైనల్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో, రెండో సెమీ ఫైనల్ 11వ తేదీన బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో కొనసాగుతాయి. 14వ తేదీన ఫైనల్ ఉంటుంది.
ఇప్పటిదాకా ఒక్క ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మినహా మరే టీమ్కు కూడా సెమీఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితం సాగుతోంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ లభిస్తుందనుకున్న దశలో అటు న్యూజిలాండ్ టీమ్ పాకిస్తాన్ చేతిలో, ఇటు టీమిండియా ఇంగ్లండ్ చేతిలో దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్లు కూడా ఒక్కో మ్యాచ్ను గెలిస్తే చాలు.
After yesterday’s result it looks it me like the Semis could be ... Australia v NZ @ OT & England v India @ Edgbaston !!!!! #CWC19
— Michael Vaughan (@MichaelVaughan) July 1, 2019
ఇదిలావుండగా- సెమీఫైనల్ ఆడబోయే టీమ్లు ఏవి అనే విషయాన్ని ఇంగ్లండ్ మాజీ కేప్టెన్ మైఖెల్ వాఘన్ అంచనా వేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్ జట్లు సెమీ ఫైనల్ ఆడతాయని తేల్చి చెప్పారు. ఆస్ట్రేలియా న్యూజీలాండ్తో, ఇంగ్లండ్ భారత జట్టుతో సెమీ ఫైనల్లో తలపడతాయని అన్నారు. ఏయే జట్లు ఫైనల్ చేరుకుంటాయనే విషయాన్ని స్పష్టం చేయలేదాయన.