Rohit Sharma: మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025లో గొప్పగా పునఃప్రవేశం చేశాడు. రోహిత్ శర్మ తన జట్టును గెలిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ హైదరాబాద్లో 46 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ను 7 వికెట్లతో ఓడించింది. ఇది ముంబై ఇండియన్స్కు నాలుగో విజయం. రోహిత్ శర్మ తన అద్భుతమైన ఇన్నింగ్స్ కోసం 'డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు' అందుకున్నాడు.మ్యాట్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా రోహిత్ శర్మ ఆ అవార్డును అందుకున్నాడు. అనంతరం జట్టు కోసం అద్భుతమైన ప్రసంగంతో రోహిత్ శర్మ అందరిని ప్రేరేపించాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఒక జట్టుగా ఇలాగే కొనసాగుదాం. నిలకడగా ఆడేద్దాం. క్లిష్ట సమయాల్లోనూ నేను మాట్లాడాను. మనదైన శైలిలో క్రికెట్ ఆడుతూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. సన్రైజర్స్ తో ఆడిన దీనికి మంచి ఉదాహరణ. ఇలాగే మిగతా మ్యాచ్ల్లోనూ రాణించాలి."అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చున్న హార్దిక్ పాండ్యా నిశ్శబ్ధంగా వింటున్నాడు. జట్టు యజమాని ఆకాశ్ అంబానీ రోహిత్ ప్రసంగించిన వెంటనే చప్పట్లతో ప్రశంసించాడు. దీనికి సంబంధించి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది. ఆ వీడియో వైరల్ గా మారింది.

రోహత్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావడంతో ముంబై ఇండియన్స్ జట్టు చాలా సంతోషంగా ఉంది. మొదటి 6 మ్యాచ్ లలో రోహిత్ శర్మ 82 పరుగులు మాత్రమే చేశాడు. కానీ గత రెండు మ్యాచ్ లలో అద్భుతంగా రాణించాడు. రోహిత్ శర్మ సీఎస్కేపై అజేయంగా 76, సన్రైజర్స్ జట్టుపై 70 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో రోహిత్ శర్మ 8 మ్యాచ్లలో 32.57 సగటుతో 154.05 స్ట్రైక్ రేట్ తో 228 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 9 మ్యాచ్ ల్లో 5 విజయాలను నమోదు చేసి మరో నాలుగింట్లో ఓటమి పాలైంది. మిగిలిన 5 మ్యాచ్ ల్లో కనీసం 3 మ్యాచ్ లు గెలిచినా ప్లేఆఫ్స్ చేరుకునేందుకు అవకాశాలు ఉంటాయి.