MI vs LSG: నేడు ఐపీఎల్ 2025లో భాగంగా 45వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రత్యేక చొరవతో రంగంలోకి దిగింది. ముంబై ఇండియన్స్ జట్టు 19 వేల మంది పేద పిల్లలకు ప్రత్యేక బహుమతిని అందించింది. ఈ రోజు మ్యాచ్ చూడడానికి 19 వేల మంది పిల్లలు వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. వారు తమ ఆరాధ్య క్రికెటర్ ను ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశాన్ని అందించింది. ఆ పిల్లలు స్టేడియంలో వారికి ఇష్టమైన జట్టును ఉత్సాహపరుస్తారు. ముంబైలో ESA(Education and Sports for All) డే మొదట 2010లో నిర్వహించబడింది.
19 వేల మంది పిల్లలకు మ్యాచ్ ఉచితంగా చూసే అవకాశం
నిజానికి 2010 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ "అందరికీ విద్య, క్రీడలు(ESA)'ను ప్రోత్సహించడానికి ఒక చొరవను ప్రారంభించారు. ఈ చొరవ కింద ఫ్రాంచైజీ వివిధ నేపథ్యాల పిల్లలు ఉచితంగా మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సారి దాదాపు 19 వేల మంది పిల్లలు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వాంఖడే స్టేడియం వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. మొదటిసారి పిల్లలు ప్రత్యక్ష క్రికెట్ చూడడానికి వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ముందు నీతా అంబానీ మాట్లాడుతూ.. ముంబై మ్యాచ్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. పిల్లలు మ్యాచ్ చూడడానికి వస్తారని చెప్పారు. కాబట్టి ఆటగాళ్లు అద్భుతంగా ఆడాలని చెప్పారు.

ESA దినోత్సవం అంటే ఏమిటి?
ESA డే (అందరికీ విద్య మరియు క్రీడలు(Education and Sports for All)) అనేది ముంబై ఇండియన్స్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించిన ఒక చొరవ, ఇది యువతకు క్రీడలు, విద్యలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2010లో ప్రారంభమైన ముంబై ఇండియన్స్ ఈ చొరవ, తరువాతి తరాన్ని రెండు రంగాలలో పాల్గొనేలా ప్రేరేపిస్తుంది. ఇది వారికి శక్తిని కూడా ఇస్తుంది. ఈ చొరవ ద్వారా ముంబై ఇండియన్స్ వివిధ ఎన్జీవోలను సంప్రదించి, అక్కడి పేద పిల్లలకు ప్రత్యక్ష మ్యాచ్లను చూపించే బహుమతిని అందిస్తుంది. ఈ పిల్లలు తమ అభిమాన క్రికెటర్లను ఉత్సాహపరుస్తూ కనిపిస్తారు.