SuryaKumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖెడె స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ముంబై జట్టు మళ్లీ భారీ స్కోరు చేయడంతో క్రికెట్ అభిమానుల్లో ఫుల్ జోష్ పెరిగింది.
తొలి భారత ప్లేయర్ గా రికార్డ్..
ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా ఐపీఎల్ లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు. 145 ఇన్నింగ్సుల్లో 2,714 బంతుల్లోనే 4 వేల పరుగుల మార్కును అందుకున్నాడు సూర్యకుమార్. ఈ క్రమంలో సురేశ్ రైనా (2,881 బంతుల్లో) రికార్డును అధిగమించాడు. మొత్తంగా అగ్రస్థానంలో డివిలియర్స్, గేల్ (2,658) ఉన్నారు. ఆ తర్వాత వార్నర్ (2,809) కొనసాగుతున్నాడు. అలానే పరుగుల పరంగా ఐపీఎల్ లో 4 వేల పరుగులు సాధించిన 17వ ప్లేయర్ గా నిలిచాడు.
ముంబై తరఫున రెండో ఆటగాడిగా..
అలానే ఐపీఎల్ లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కీరన్ పొలార్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ - 5698 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ - 3413 రన్స్, కీరన్ పొలార్డ్ - 3412 పరుగులు, అంబటి రాయుడు - 2416 పరుగులు, సచిన్ టెండుల్కర్ - 2334 రన్స్ చేశారు.
ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం..
ఇంకా ఈ ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ రేసులో 10 మ్యాచుల్లో 427 పరుగులు మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (జీటీ) - 417 పరుగులు, కోహ్లీ (ఆర్సీబీ) - 392 పరుగులు, నికోలస్ పూరన్ (లక్నో) - 377 పరుగులు, జోస్ బట్లర్ (జీటీ) - 356 రన్స్ చేశారు.
ఆ ఇద్దరూ ఊచకోత..
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టులో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇర ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్స్లుగా మలిచి, మంచి ఊపుమీద కనిపించిన రోహిత్ శర్మ ఐదో బంతికే పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో 12 పరుగులు చేసి త్వరగానే క్రీజును వదిలాడు. విల్ జాక్స్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్య (5) నిరాశపరిచారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 25*), కోర్బిన్ బాష్ (10 బంతుల్లో 20) కాస్త మెరుపులు మెరిపించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, అవేశ్ ఖాన్ 2, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
