
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో ఆసీస్ వెటరన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు చోటు దక్కలేదు. దీంతో తొలి రెండు టెస్టులకు తనను ఎంపిక చేయని ఆసీస్ సెలక్టర్లపై మ్యాక్స్వెల్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో భాగంగా న్యూసౌత్ వేల్స్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో 318 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్వెల్ 36 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 278 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 213 పరుగులతో నాటౌట్గా నిలిచిన మ్యాక్స్వెల్ రెండో రోజు ట్రిపుల్ సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు.
ఇదిలా ఉంటే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో ఆరోస్థానం కోసం ఆసీస్ జట్టు మ్యాక్స్వెల్ కంటే షాన్ మార్ష్ను తీసుకుంది. అయితే బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో షాన్ మార్ష్ (51) పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో స్మిత్ సెంచరీతో సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో ఆరోస్థానం కోసం ఆసీస్ జట్టు మ్యాక్స్వెల్ కంటే షాన్ మార్ష్ను తీసుకుంది. అయితే బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో షాన్ మార్ష్ (51) పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో స్మిత్ సెంచరీతో సత్తా చాటాడు.