
గొడవ కాకుండా ఆపా
అండర్సన్ బ్యాటింగ్ దిగిన సమయంలో అశ్విన్ ఈ విషయంపై అతనితో మాట్లాడుతుంటే నేను వారి వద్దకు వెళ్లి గొడవ కాకుండా ఆపానని కోహ్లీ పేర్కొన్నాడు. ‘క్రికెట్లో ఇవన్నీ సర్వసాధారణమే, ఎటువంటి గొడవలు లేకుండా ముందుకు సాగుదాం పదా. అని అండర్సన్తో అన్నాను.' అని కోహ్లీ చెప్పాడు.

ఆండర్సన్తో గొడవకు కారణం అదే
నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత తనపై చేసిన వ్యాఖ్యలకు అసంతృప్తి చెందిన అశ్విన్ ఆ రకంగా ఆండర్సన్తో గొడవ పడి ఉండొచ్చని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లాండ్పై ఈ సిరిస్ విజయం అత్యంత మధురమని కోహ్లీ తెలిపాడు. ఈ మధ్య కాలంలో తాము సాధించిన సిరిస్ విజయాలకంటే ఇదే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

ఆటగాడిగా, కెప్టెన్గా నాకు ఎంతో ప్రత్యేకం
‘ఇప్పటి వరకు గెలిచిన సిరీస్లన్నీ ఒకెత్తు. ఇది ఒకెత్తు. ఈ సిరీస్ విజయం మరుపురానిది. ఆటగాడిగా, కెప్టెన్గా నాకు ఇదెంతో ప్రత్యేకమైనది' అని కోహ్లీ అన్నాడు. ముంబై టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్పై 3-0తో భారత్ టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఓర్వలేని ఆ జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

భారత్ విజయానికి కారణం ఇక్కడి స్లో పిచ్లే
భారత్ విజయానికి కారణం ఇక్కడి స్లో పిచ్లే అంటూ ధ్వజమెత్తాడు. పేస్కు అనుకూలించిన పిచ్లను తయారు చేసినందువల్లే ఇంగ్లాండ్ ఘోరంగా ఓటమి పాలైనట్లు ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతకాదు భారత్ పిచ్లను రూపొందించే క్రమంలో పాటించాల్సిన సాంకేతిక పద్ధతులను పాటించలేదని ఆండర్సన్ విమర్శించాడు.

కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు
ఇదంతా కూడా విరాట్ కోహ్లే చెప్పడం వల్లే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ అప్పట్లో బ్యాటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేశాడు. ‘కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు. అతడి బ్యాటింగ్లో లోపాలు ఇక్కడి పిచ్లపై కనిపించడం లేదంతే. పిచ్ల్లో వేగం, స్వింగ్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్లో మాదిరిగా అతడిని ఔట్ చేయలేపోయాం' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications