
డైవ్ కొట్టి మరీ
అలాంటి బంతిని వికెట్ కీపర్ మహ్మద్ మిథున్ డైవ్ కొట్టి మరీ ఆపడం విశేషం. దీంతో క్రిష్మర్ వేసిన నోబాల్ను చూసి అందరూ అవాక్కయ్యారు. అతడి కుడికాలు క్రీజ్కు చాలా దూరంగా పడటంతో నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరామని సిలెట్ థండర్ డైరెక్టర్ తంజిల్ చౌధురి వెల్లడించాడు.

నో బాల్ లేదా వైడ్పై విచారణ
"నో బాల్ లేదా వైడ్పై విచారణకు ఆదేశించాం. మొత్తంగా మాకు బరిలోకి దిగే ఎలెవన్ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్మెంట్, కోచ్ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. మేనేజ్మెంట్తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్ చేసి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డడా? అనే అనుమానం ఉంది" అని అన్నాడు.

ఎవరి ప్రమేయమైనా ఉందా?
సంతోకి ఇలా నో బాల్ వేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తామని తంజిల్ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో సిలెట్ థండర్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.


Click it and Unblock the Notifications












