
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రెండేళ్ల బుడతడి ఆటకు ఫిదా అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే... మోహిసిన్ అనే క్రికెట్ అభిమాని తన మేనల్లుడైన హషీమ్ క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్వీటర్ వేదికగా పోస్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ, ధోని, సచిన్ టెండూల్కర్లకు ట్యాగ్ చేస్తూ బాగా ఆడుతున్నాడా? అని ప్రశ్నించాడు.
ఈ వీడియోని చూసిన సచిన్ టెండూల్కర్ ఆ బుడతడి ఆటకు ఫిదా అయ్యాడు. రెండేళ్లకే స్ట్రయిట్ డ్రైవ్స్, లాఫ్టెడ్ షాట్స్, ఫ్లిక్స్ను సునాయాసంగా ఆడుతున్న అతడు 'ఫర్ఫెక్ట్ మోడ్రన్ డే ప్లేయర్' అంటూ సచిన్ కొనియాడాడు. 'ఇదొక మంచి ఆరంభం. ఇలానే గేమ్ను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగు. నీకు ఇవే నా బెస్ట్ విషెస్' అని సచిన్ ట్వీట్ చేశాడు.