కరాచీ: వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్కు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు పాకిస్థాన్ సైనిక దళంలో చేరాలని ఉందని వ్యాఖ్యానించాడు. ఇటీవలే లాహోర్లో నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్లో పెషావర్ జల్మి తరఫున శామ్యూల్స్ ఆడాడు.
చాలా ఏళ్ల తర్వాత అంతర్జాతీయ స్టార్లు పాకిస్థాన్లో ఆడటంతో పాక్ సైనిక దళాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాయి. మ్యాచ్ ఏ ఇబ్బందులూ లేకుండా సాగింది.
పాకిస్తాన్ సైన్యం పనితీరుకు ముగ్ధుడైన శామ్యూల్స్ ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పాకిస్థాన్లో క్రికెట్ ఆడడం చాలా ఆనందాన్నిచ్చిందని, ఇక అభిమానుల ఆనందం చూస్తే ముచ్చట వేసిందని, తన భుజంపై ఆర్మీ బ్యాడ్జ్ ఉండాలని అనుకుంటున్నానని, పాక్ సైన్యంలో చేరాలనేది తన కోరిక అని చెప్పాడు.
షాకింగ్: కోహ్లీని జంతువులతో పోల్చిన ఆసిస్ మీడియా