ప్రపంచ క్రికెట్ లో కవ్వింపు చర్యలకు పెట్టింది పేరు ఆసీస్ . అయితే ఈ నెల 24 నుంచి ఇండియా రెండు టీ 20 లు , ఐదు వన్డేలు ఆడనున్నది. దీనితో మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ "ఆసీస్ తో కోహ్లీ సేన కు ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నాడు. అంతటి తో ఆగకుండా ఆసీస్ అల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను పాండ్యా తో పోల్చుతూ పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు.
పాండ్యా ఇంకా చాలా నేర్చు కోవాలని పరిస్థితులకు తాగుతూ ఆడటం పాండ్యాకు ఇంకా అలవడలేదని " వ్యాఖ్యానించాడు. అలాగే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్తో ఇబ్బందులు తప్పవని ఈ ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు హెచ్చరించాడు. కమిన్స్ తన వైవిద్య బంతులతో ధవన్ను బోల్తా కొట్టిస్తాడనన్నాడు. స్వింగ్ , షార్ట్ పిచ్ బంతులు ఎలా ఆడాలో ధావన్ తెలుసుకోవాలని ఈ మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు .
అయితే స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. చాహల్ తో ఆసీస్ కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. ఇప్పటివరకు ఈ యువ స్పిన్నర్ 40 వన్డేల్లో 71 వికెట్లు, 29 టీ20ల్లో 45 వికెట్లు తీశాడని.. ఈ గణాంకాలను ను బట్టి చాహల్ ప్రతిభ ను అర్ధం చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాక్స్ వెల్ బారత పిచ్ ల పైన రాణించలేక పోతున్నాడని తెలిపాడు .