వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అశ్విన్ రిటైర్మెంట్ పై పలువురు మాజీ క్రికెటర్లు, బీసీసీఐ స్పందించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అశ్విన్ రిటైర్మెంట్ పై ట్వీట్ చేశాడు." అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో త్వరగా 250, 300, 350, 400, 450 వికెట్లు పడగొట్టారని చెప్పారు. టెస్ట్ క్రికెట్లో 37 సార్లు ఐదు వికెట్లు తీసిన వారిలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత అశ్విన్ ఉన్నాడు" అని సచిన్ పేర్కొన్నాడు.
భారత ప్రధాన కోచ్ గంభీర్ కూడా స్పందించారు. "మీరు ఒక యువ బౌలర్ నుం;F ఆధునిక క్రికెట్లో లెజెండ్గా ఎదగడం గొప్ప విషయం. నిన్ను మిస్ అవుతారు సోదరా! " అని చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ట్వీట్ చేసింది. "భారతీయ అభిమానులందరి నుంచి చాలా కౌగిలింతలు వచ్చాయి. యాష్ అన్నా!" అని విరాట్ కోహ్లీ, అశ్విన్ కలిసి ఉన్న వీడియోను ట్వీట్ చేసింది. బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. " ధన్యవాదాలు అశ్విన్. మీ ఆట గొప్పగా ఉంటుంది.

టీమిండియా అమూల్యమైన ఆల్ రౌండర్ మీరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు" ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీ కూడా ట్వీట్ చేశాడు. " నేను మీతో 14 సంవత్సరాలు ఆడాను. ఈ రోజు మీరు రిటైర్ అవుతున్నారని మీరు నాకు చెప్పినప్పుడు అది నన్ను కొంత భావోద్వేగానికి గురి చేసింది. నేను మీతో ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భారత క్రికెట్కు మీ సేవ మరువలేనిది. మీరు ఎప్పటికీ, ఎల్లప్పుడూ భారతీయ క్రికెట్ లెజెండ్గా గుర్తుండిపోతారు. మీ కుటుంబంతో పాటు మీ జీవితంలో ఉత్తమంగా గడపాలని కోరుకుంటున్న" అని ట్వీట్ చేశాడు.