దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మను సాహ్ని బాధ్యతలు చేపట్టారు. భారత్కు చెందిన మను సాహ్ని సోమవారం తన బాధ్యతలను నిర్వర్తించారు.
2012 నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న డేవ్ రిచర్డ్సన్ త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్ -2019 తర్వాత పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే మను సాహ్ని వరల్డ్ కప్ వరకు డేవ్ రిచర్డ్సన్తో కలిసి పని చేస్తారు. రిచర్డ్సన్ తప్పుకున్న తర్వాత మను సాహ్ని పూర్తి స్థాయిలో తన బాధ్యతలను చేపట్టనున్నారు.
మను సాహ్ని ఈఎస్పీఎన్ స్టార్ స్పోర్ట్స్ సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసారు. సాహ్నికి ప్రసార హక్కులు, మార్కెటింగ్ వంటి విభాగాల్లో పనిచేసి ఆ సంస్థకు భారీ ఆదాయంను తెచ్చారు.