For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టు ఎంపికలో పక్షపాతం, స్టార్ కల్చర్‌.. బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్!

భారత క్రికెట్ జట్టులో ప్రబలంగా ఉన్న పక్షపాతం, స్టార్ కల్చర్‌పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కెప్టెన్లు తమ ప్రాంతానికి చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది భారత క్రికెట్‌లో చాలా కాలంగా ఉన్న సమస్య అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

గౌతమ్ గంభీర్ కోచింగ్.. డ్రెస్సింగ్ రూమ్ కల్చర్
టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి 'స్టార్ కల్చర్'ను పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పడం తెలిసిందే. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా వంటి సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గంభీర్‌తో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో ఆడిన మనోజ్ తివారీ, భారత క్రికెట్‌లో స్టార్ కల్చర్ కంటే పక్షపాతమే ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఎంపికలో కెప్టెన్ల వ్యక్తిగత ఇష్టాలు కీలకంగా మారాయని ఆయన పేర్కొన్నారు.

Manoj Tiwary Slams Favoritism and Star Culture in Indian Cricket

ఇష్టమైన ఆటగాళ్లకే చోటు

ఓ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ భారత డ్రెస్సింగ్ రూమ్ కల్చర్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. తన మాజీ బెంగాల్ సహచరుడు ఉత్పల్ ఛటర్జీని ఉదాహరణగా చూపుతూ.. కెప్టెన్‌కు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పల్ ఛటర్జీ బెంగాల్ తరఫున 500కు పైగా ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించినప్పటికీ, భారత్ తరఫున కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడగలిగాడని గుర్తు చేశారు. ఉత్పల్ ఛటర్జీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడం వెనుక ఇటువంటి పక్షపాతమే ఉందని ఆయన పరోక్షంగా సూచించారు.

కెప్టెన్ల ప్రాధాన్యతలు..
"నేను గతంలో చెప్పినట్లుగానే, భారత క్రికెట్‌లో ఇష్టాలు-అనిష్టాలు చాలా ఎక్కువ. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు, చాలా కాలంగా ఉంది. ఒక కెప్టెన్ ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందినవాడైతే, అతను తన ప్రాంతంలోని ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో కెప్టెన్లు తమ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు ఇతరులకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు" అని మనోజ్ తివారీ కుండబద్దలు కొట్టారు. ఇది జట్టు కూర్పును, ఆటగాళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.

రింకూ సింగ్, హర్షిత్ రాణా ఎంపికపై ప్రశ్నలు
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత మనోజ్ తివారీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టోర్నమెంట్ కోసం ఎంపికైన 15 మంది సభ్యుల జట్టులో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లకు చోటు లభించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో రింకూ సింగ్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల ఎంపిక పలు సందేహాలకు తావిచ్చింది. వీరిద్దరూ కేకేఆర్ తరఫున గంభీర్ కోచింగ్‌లో ఆడటం గమనార్హం. మనోజ్ తివారీ ఎవరి పేరును స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఆయన మాటలు ఇటువంటి ఎంపికలను ఉద్దేశించే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

సోషల్ మీడియా ప్రభావం
ఆధునిక క్రికెట్‌లో సోషల్ మీడియా పాత్ర గురించి మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఇది పక్షపాతాన్ని కొంతవరకు తగ్గించగలదని అభిప్రాయపడ్డారు. "క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో లేదా ప్రత్యక్ష మ్యాచ్‌లలో ప్రతిదీ చూడగలరు. అందుకే ఈ పరిస్థితులను అందరి నుంచి దాచడం కష్టం," అని ఆయన అన్నారు. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అన్యాయం జరగదనే నమ్మకం ఇప్పుడు ఉందని, మీడియా, సోషల్ మీడియా వల్ల ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు మరింత హైలైట్ అవుతున్నాయని మనోజ్ తివారీ చెప్పారు. ఇది కచ్చితంగా ఆధునిక క్రికెటర్లకు ఒక లాభమని ఆయన వ్యాఖ్యానించారు.

Story first published: Tuesday, August 26, 2025, 11:26 [IST]
Other articles published on Aug 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+