
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం నేరుగా సచిన్ ఇంటి ల్యాండ్ లైన్కు ఫోన్ చేసి వేదింపులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడికి పిచ్చి ఉందంటూ అతని తల్లిదండ్రులు పేర్కొనడంతో అతనిపై మానసిక పరీక్షలు చేయించారు.
ఈ పరీక్షల్లో నిందితుడు (దేవ్కుమార్ మైటీ) ఓ మానసిక రోగి అని అతనికి సిజోఫ్రెనియా వ్యాధి ఉందని వైద్యులు తేల్చారు. అంతేగాక అతను మిడ్నాపూర్ స్టేషన్ రోడ్లోని ఓ మానసిక వైద్యుని వద్ద గత ఐదేళ్లుగా చికిత్స తీసుకుంటున్నాడని ఆధారాలు చూపించారు.
ఈ వ్యాధితో ఉన్నవాళ్లు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారట. అక్టోబరు 10, డిసెంబరు 20 తేదీల్లో చికిత్సకు వెళ్లాల్సి ఉంది. సకాలంలో హాజరుకాకపోవడంతో వ్యాధి ముదిరి ఇలా ప్రవర్తించాడనే నివేదికను ఇచ్చారు.
కానీ, ఇప్పటికీ సదరు వ్యక్తి సచిన్ కూతురు తనను ఇష్టపడుతుందని తనతో పెళ్లికి కూడా సిద్ధంగా ఉందనే భ్రమలోనే ప్రస్తుతం ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.