హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. సెర్బియాకు చెందిన నటాషా స్టాన్తో తనకు ఎంగేజ్మెంట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. నటాషా చేతికి రింగ్ పెట్టుకొని ఉన్న ఫొటోలను హార్థిక్ తన ఇనిస్టాగ్రామ్లో షేర్ చేశాడు.
ఓ ప్రైవేట్ బోటుపై చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసి అతికొద్ది మంది స్నేహితుల మధ్య మధ్య వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా ''మే తేరా, తూ మేరీ జానే సారా హిందుస్తాన్ (నీకు నేను, నాకు నువ్వు హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి) అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
'ఈ మనిషితో 2020': పార్టీ వేర్లో మరింత అందంగా ధోని భార్య సాక్షి
{photo-feature}
View this post on InstagramForever yes 🥰💍❤️ @hardikpandya93
A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on